టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది భీష్మ సినిమాతో భారీ సక్సస్ ని అందుకొని మళ్ళీ ఫాం లోకి వచ్చాడు. వరసగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన నితిన్ కరోనా కారణంగా ఆ ప్రాజెక్ట్స్ అన్ని డిలే అవుతూ వస్తునాయి. కాబట్టే ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన రంగ్ దే 2021 సంక్రాంతికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో నితిన్ – కీర్తి సురేష్ జంటగా నటించగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు.
కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమోషన్స్ బాగా ఊపందుకున్నాయి. రంగ్ దే సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నవంబర్ 12న సాయంత్రం గం. 4.05 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే నితిన్ నటించిన ‘భీష్మ’ మంచి కమర్షియల్ హిట్ గా నిలవడం తో ఇప్పుడు ‘రంగ్ దే’ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అప్పటికి మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇదొక రిస్క్ అని ఇప్పటికే కొందరు భావిస్తుండగా మళ్ళీ కరోనా వ్యాప్తి ఎక్కువవుతుండటంతో సంక్రాంతి సీజన్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయకపోవడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాదు అప్పటికైనా జనాలు ధైర్యం చేసి థియోటర్స్ కి వస్తారా అన్నది క్లారిటి లేదు. అయినా నితిన్ మాత్రం రంగ్ దే సినిమాతో రెడీ అవుతున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక ఈ సినిమా తర్వాత చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ అన్న సినిమా చేస్తున్నాడు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ .. ప్రియ ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.