Nivetha thomas : రీసెంట్గా వకీల్ సాబ్ సినిమాతో ఫాంలోకి వచ్చిన యంగ్ బ్యూటీ నివేదా థామస్ త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో జాయిన్ కాబోతోంది. ఇటీవల ఈమె ఓ కొరియన్ సినిమా తెలుగు రీమేక్ లో నటించడానికి రెడీ అవుతోందట. ఈ చిత్రంలో మరో యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా నటిస్తోంది. ఇదొక లేడీ మల్టీస్టారర్గా రూపొందనుండటం విశేషం. యువ దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. కొరియన్ భాషలో వచ్చి సూపర్ హిట్ అయిన యాక్షన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’. ఈ సినిమా రీమేక్ లోనే వీరు నటిస్తున్నారు. మాతృకలో ఇద్దరు యంగ్ హీరోలు నటించారు. కానీ తెలుగు రీమేక్ లో ఆ పాత్రలను అమ్మాయిలకు అనుగుణంగా స్క్రిప్ట్ మార్చి ఉమెన్ సెంట్రిక్ మూవీగా సుధీర్ వర్మ తయారు చేయబోతున్నాడు.
ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి అయిన ఈ మూవీని ‘శాకినీ- ఢాకినీ’ అనే టైటిల్ తో తీసుకు రానున్నట్టు తెలుస్తోంది. కాగా పోలీస్ ఆఫీసర్ ట్రైనీస్గా ఉండే ఇద్దరు అమ్మాయిలు ఊహించని విధంగా ఉమెన్ ట్రాఫికర్స్ గ్యాంగ్ ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి..మానవ రవాణా ముఠా నుండి తమని తాము ఎలా రక్షించుకున్నారు? మిగిలిన వాళ్ళని కూడా ఏవిధంగా రక్షించారన్న ఆసక్తికరమైన కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిస్తున్నారట. ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిరాత దగ్గుబాటి సురేశ్ బాబు, సునీత తాటి కలిసి నిర్మిస్తున్నారు.
Nivetha thomas : నివేథా థామస్ మీట్ క్యూట్ లో కూడా నటిస్తున్నట్టు సమాచారం.
ఇందులో ఈ ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టర్స్ చాలా కొత్తగా ఉంటాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ని త్వరలో మొదలు పెట్టబోతున్నారట. ఈ షెడ్యూల్ ఓ భారీ ఫైట్ తో ప్రారంభం కానుందట. ఈ ఫైట్ నివేథా – రెజీల మధ్య సూట్ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అన్నీ సకాలంలో పూర్తి అయితే విజయ దశమి పండుగ సందర్భంగా ఈ ఏడాదిలోనే భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఇక రెజీనా వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉంది. వాటిలో లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ఉంది. అలాగే నివేథా థామస్ ఈ సినిమాతో పాటు నాని నిర్మాణంలో రూపొందుతున్న మీట్ క్యూట్ లో కూడా నటిస్తున్నట్టు సమాచారం.