Nivetha thomas : ఇటీవలే యంగ్ బ్యూటీ నివేత థామస్ వకీల్ సాబ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె సౌత్ కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ తెలుగు రీమేక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్ చేస్తున్నాడు. మరో యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్ర నటిస్తోంది. స్వామి రారా సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకొని టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు సుధీర్ వర్మ. ఈ సినిమా తర్వాత కూడా ఆయన విభిన్నమైన సినిమాలని తెరకెక్కిస్తూ పాపులర్ అయ్యాడు. కాగా ఇటీవల ఈ సినిమాను మొదలు పెట్టాడు.
మార్చ్ లో మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ పడి ఆగిపోయింది. కాగా ఇటీవల మళ్ళీ షుటింగ్ మొదలవగా నివేత థామస్ – రెజీనాపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపి ఆగస్టు చివరి వారం వరకూ చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ఇక ఇందులో ఈ ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ కళ్ళు మిరిమిట్లు గొలిపే స్టంట్స్ చేస్తారని సమాచారం. దీని కోసం నివేత, రెజీనా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. ఇక వీరి మీద తెరకెక్కించే సన్నివేశాలు సినిమాకి చాలా హైలెట్ గా నిలుస్తాయట.
Nivetha thomas : త్వరలో అధికారకంగా మూవీ టైటిల్ ప్రకటించనున్నారట.
ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్ నిర్మాతలు. ఇంతకముందు వీరు కాంబినేషన్ లో సమంత ప్రధాన పాత్రలో నిర్మించిన ‘ఓ బేబీ’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గత కొంతకాలంగా మంచి కమర్షియల్ హిట్ అందుకోలేపోయాడు సుధీర్ వర్మ. దాంతో ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ అందుకొవాలని ట్రై చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకి ప్రస్తుతం శాకిని – ఢాకిని అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలో అధికారకంగా మూవీ టైటిల్ ప్రకటించనున్నారట.