నల్ల బంగారం అదేనండి బొగ్గు గనులను ప్తైవేటికరణ చేస్తమని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టిన కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రపంచంలో బొగ్గు వినియోగదారులలో భారత్ రెండవది. అలానే బొగ్గు ఉత్పత్తిలో కూడా ఇండియాది ద్వితియ స్థానమే.
దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటించింది. దీనిపై విదేశీ సంస్థలు కాని, పెట్టబడిదారులు కాని ఎవరు కూడా ఆసక్తి చూపలేదు.38 బొగ్గు గనులలో 15 గనులకు ప్రభుత్వం ఎలువంటి బిడ్లు పొందలేదు. తక్కువ లాభాలు ఉండే ఈ రంగాన్ని ప్తైవేటు పరం చేస్తే లాభాలు అర్జించవచ్చు అని ప్రభుత్వం బావించింది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయినా ఎవరు అంత ఆసక్తి చూపలేదు.
భారత్ లో బొగ్గు ఉత్పత్తి కోల్ ఇండియా లిమిటెడ్ నిర్వహింస్తుంది. అయితే భారత్ ప్రధాని మోదీ ప్తైవేటు బాగస్వామ్యం కోసం చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్తైవేటు పెట్టుబడులు ఆకర్షించడానికి వేలం వేస్తున్న మొత్తం గనులు 38. వీటిలో 23 బొగ్గు గనులకు మాత్రం 76 బిడ్లు వచ్చాయి. 15 గనులకు ఎవరు ఆసక్తి చూపలేదు, అని బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్, అల్యూమినియం కపెనీలు హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ అల్యూమినియం కో లిమిటెడ్, వేదాంతం లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, బిడ్ లలో పాల్గోన్న 42 కంపెనీలలో ఉన్నాయని బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక తెలియజేసింది. బొగ్గు తవ్వకాలకు 40 శాతం గనులకు ఎవరు ఆసక్తి చూపలేదు. అలానే అనుభవం లేని కంపెనీ లు కూడా బొగ్గు త్రవ్వకాలకు బిడ్ సమర్పించాయి.