యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రెండు భారీ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రాధే శ్యాం, అలాగే దర్శకుడు నాగశ్విన్ తో చేస్తున్న ప్రభాస్ 21 వ సినిమా. ముఖ్యంగా ఈ సినిమా వైజయంతీ మూవీస్ కి 50 వ సినిమా కావడంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదనుకుంటున్నారట దర్శక, నిర్మాతలు.
అందుకే ఎంత బడ్జెట్ అయినా ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్నట్టు ముందు నుంచి చిత్ర యూనిట్ చెప్పుకొస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా దర్శకుడు నాగశ్విన్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ను హీరోయిన్ గా సెలెక్ట్ చెసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంగీత దర్శకున్ని ఫైనల్ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయట.
ప్రభాస్ 21 వ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ లేదా “బాహుబలి” తో గ్రాండియర్ ఆల్బమ్, మెస్మరైజింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఎం ఎం కీరవాణి గాని ఈ సినిమాకి సంగీత దర్శకునిగా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం సినిమాకి సంగీత దర్శకుడు ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్ సమర్పిస్తుండగా యువి క్రియోషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2021 సమ్మర్ లో రిలీజ్ చేస్తారని సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?