ఢిల్లీ, జనవరి 24: సిబిఐ చీఫ్ ఎంపిక వ్యవహారం తేలలేదు. గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటి నూతన సిబిఐ డైరెక్టర్ ఎంపికకు సమావేశమయ్యంది. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ లు హైపర్ కమిటి సభ్యులుగా హజరయ్యారు.
సమావేశంలో సిబిఐ చీఫ్ ఎంపిక జరగలేదు. మరో వారంలోగా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు.
సీనియారిటీ, నిబద్ధత, నిజాయితి, సిబిఐలో పనిచేసిన అనుభవం తదితర విషయాలను ప్రామాణికంగా తీసుకుని 1982-1985 మధ్య బ్యాచ్ లకు చెందిన ఐపిఎస్ అధికారుల నుండి 15 మందిని పిఎంఒ షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. ప్యానల్ లిస్ట్ లో 70 నుండి 80మంది వరకూ ఉన్నారు. వీరికి సంబందించిన పూర్తి వివరాలు కమిటి ముందు ప్రవేశపెట్టలేదు.
ప్యానల్ లిస్ట్ పూర్తి స్ధాయిలో పరిశీలన చేయవలసి ఉందని తనతో పాటు సిజెఐ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారని’ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే సమావేశం ముగిసిన తరువాత మీడియాతో అన్నారు.