అరవింద సమేత వీర రాఘవ… యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. ఈ సినిమాతో ఇద్దరికి మంచి కమర్షియల్ హిట్ దక్కింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళని రాబట్టింది. ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించాడు. అప్పటి నుంచి మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నారన్న ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందా అని అనుకున్నారు. కాని కరోనా కారణంగా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో మొదలయ్యోలా లేదని అంటున్నారు.
ఎన్టీఆర్, రాం చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఇంకా చాలా వరకు టాకీ పార్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ సినిమా పూర్తయ్యాకే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా మొదలవుతుందని ..అది కూడా 2021 సమ్మర్ తర్వాతే అని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ ని 2021 సమ్మర్ లో రిలీజ్ చేస్తారని సమాచారం. ఆ తర్వాత ఈ సినిమా మొదలై 2022 సంక్రాతికి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కనుంది.