స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ లోన్ తీసుకున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ఎస్బీఐ.. లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ కింద ఈఎంఐ మారటోరియం స్కీమ్ ను ప్రకటించింది. రెండేళ్ల పాటు ఈఎంఐ మారటోరియం స్కీమ్ ను ప్రకటించింది. అంటే.. ఈ స్కీం కింద రెండేళ్ల పాటు ఈఎంఐలు కట్టాల్సిన పనిలేదన్నమాట.
ఎస్బీఐలో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకున్న వాళ్లకు ఈ స్కీం వర్తిస్తుంది. ఎస్బీఐలో ఏ లోన్ అయినా సరే.. 1 మార్చి 2020 లోపు తీసుకొని ఉండాలి. ఆ తర్వాత తీసుకున్న వాళ్లకు ఈ స్కీం వర్తించదు.
అయితే.. లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ఆప్షన్ ను ఎంచుకుంటే.. అదనంగా 0.35 శాతం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే.. కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయిన వారు, వ్యాపారం దెబ్బతిన్నవారు మాత్రమే లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ కింద అప్లయి చేసుకోవచ్చు. కరోనా ప్రభావం లేనివాళ్లు.. అంటే ఆదాయంపై ఎటువంటి ప్రభావం లేనివాళ్లు తమ ఈఎంఐలను కొనసాగించుకోవచ్చు.
లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ కింద అప్లయి చేసుకోవాలనుకునే వాళ్లు… ఎస్బీఐ పోర్టల్ లోకి వెళ్లి.. బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చి అప్లయి చేసుకోవాలి. డిసెంబర్ 24, 2020 లోపు దరఖాస్తు చేసుకుంటే.. బ్యాంక్ వెరిఫై చేసుకొని ఈఎంఐ మారటోరియాన్ని వర్తింపజేస్తుంది.