సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కియారా అద్వానీ. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటి నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక మళ్ళీ టాలీవుడ్ లో కనిపించలేదు. అందుకు కారణం అవకాశాలు రాక కాదు. వచ్చిన అవకాశాలు ఒప్పుకునే సమయం లేక.
బాలీవుడ్ లో ధోనీ సినిమా ముందు చేసినప్పటికి లస్ట్ స్టోరీస్ తో ఓవర్ నైట్ ఫేం సంపాదించుకుంది. అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో కియారా కి తిరుగులేకుండా పోయింది. వరసగా భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్స్ తో మేకర్స్ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే ముందు హీరోయిన్ గా కియారా పేరునే పరిశీలిస్తున్నారట.
ఇక ప్రస్తుతం ఈ భామ ‘ఇందూ కి జవానీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజై సంచలనం సృష్ఠించింది. రోమ్-కామ్ లో ఇందూ గుప్తా అనే పాత్రను పోషిస్తోంది కియారా. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఇక తమిళం, తెలుగులో సూపర్ హిట్ అయిన కాంచన సినిమాకి రీమేక్ గా రూపొందింది. మొత్తానికి బాలీవుడ్ లో కియారా ని ఇప్పట్లో అడ్డుకునే మరో హీరోయిన్ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదని అంటున్నారు.