ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెత్ తో నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో “రౌద్రం రణం రుధిరం” మొదటిది. పాన్ ఇండియన్ కేటగిరిలో నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సంవత్సరం సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన సినిమా ఆగిపోయింది. 2021 సంక్రాంతికి అనుకుంటే అప్పుడు రిలీజ్ కావడం అసాధ్యం కావడంతో మళ్ళీ 2021 సమ్మర్ టార్గెట్ గానే మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినీ వర్గాల్లో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. సుశాంత్ సింగ్ మృతి తర్వాత బాలీవుడ్ లో రక రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నెపొటిజం తో పాటు డ్రగ్స్ వ్యవహారం కుదిపేసింది.
చాలా మంది స్టార్ నటులు సహా నిర్మాతల సినిమాల మీద ఈ సంఘటన బాగానే ప్రభావం చూపించింది. నెపొటిజం కారణంగానే “సడక్ 2” విషయంలో ఆలియా బాగా ట్రోల్ కి గురైంది. దీంతో ఇప్పుడు ఆలియా భట్ “రౌద్రం రణం రుధిరం” లో రాం చరణ్ కి జంటగా నటిస్తున్న కారణంగా ఆర్ ఆర్ ఆర్ మీద ఆ ప్రభావం ఉంటుందేమో అన్న అనుమానాలని వ్యక్తం చేశారు.
దీనికి దర్శకుడు రాజమౌళి ఒక్కొక్కరికి దిమ్మ తిరిగే సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఆలియా భట్ ఫెంటాస్టిక్ పెర్ఫామర్ అని ఒక్కమాటలో తెల్చి పారేశారు. అంతేకాదు మా సినిమాలో చేయాల్సిన క్యారక్టర్ కి తను ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుందనే ఆలియాని ఎంచుకున్నాము. పర్సనల్ లైఫ్ లో జరుగుతున్న విషయాలు నా సినిమాపై ప్రభావం చూపిస్తాయని నేను అనుకోవడం లేదు. సోషల్ మీడియాలో వచ్చేవన్ని పట్టించుకుంటేనే కష్టం అంటూ ఊహించని సమాధానం చెప్పారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!