మాస్ మహారాజ రవితేజ అంటే మాంచి జోష్ ఉన్న హీరో. రవితేజ సినిమా అంటే పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఊరమాస్ జనాలకి రవితేజ సినిమాలు మంచి కిక్ ఇస్తాయి. మాస్ హీరోగా రవితేజ తనకంటూ ఒక కొత్త ఇమేజ్ ని క్రియోట్ చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా రవితేజ ఎనర్జీకి తగ్గ సినిమాలు రావడం లేదు. దాంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఆమద్య వచ్చిన రాజా ది గ్రేట్ సూపర్ హిట్ అవడంతో మళ్ళీ రవితేజ ఫుల్ ఫాం లో కి వచ్చాడనుకున్నారు.
కాని ఆ తర్వాత వచ్చిన నేల టికెట్, అమర్ అక్బర్ యాంటోని, టచ్ చేసి చూడు, డిస్కో రాజా వరసగా ఫ్లాపయ్యాయి. దాంతో ఎలాగైనా మరోసారి మాస్ హిట్ కొట్టి సక్సస్ ట్రాక్ లోకి రావాలాన్న కసితో తనకి రెండు హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా రవితేజ మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాని ఇప్పుడు ఆ సినిమాల ఆర్డర్ తారుమారయిందని అంటున్నారు.
‘క్రాక్’ కంప్లీటవగానే ఆ వెంటనే త్రినాథ్ రావ్ నక్కినతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడట. అయితే వాస్తవంగా ‘క్రాక్’ పూర్తయ్యాక .. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ సినిమా చేయాలనుకున్నాడు రవితేజ. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుందట. దాంతో త్రినాథ్ రావు నక్కిన తెరకెక్కించబోయే సినిమాని ముందు సెట్స్ పైకి తీసుకువెళ్లాలని రవితేజ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
ఇప్పటి వరకూ త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్లో వచ్చిన అన్ని సినిమాలు హిట్స్ గా నిలిచాయి. అంతేకాదు త్రినాథ్ రావు సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. కాబట్టి రవితేజ ఇలాంటి సమయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడని అంటున్నారు. ఇక యధావిధిగా ఈ సినిమా కంప్లీటయ్యాక రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తాడట.