ఢిల్లీలో పుట్టి పెరిగిన బొద్దుగుమ్మ రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు మద్రాస్ కేఫ్ సినిమాతో హిందీ సీమలో అడుగు పెట్టింది. అయితే టాలీవుడ్ లోనే రాశీఖన్నా కి బాగా పాపులారిటీ వచ్చింది. తెలుగులో వరసగా యంగ్ హీరోలతో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. ఇలా సూపర్ హిట్స్ దక్కినప్పటికీ స్టార్ హీరోలతో మాత్రం నటించే అవకాశాలు రావడం లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో నటించిన రాశీ ఆ తర్వాత భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తాయని భావించింది. కాని ఎందుకనో రాశీ అనుకున్నట్టు మాత్రం బడా నిర్మాణ సంస్థలలో.. స్టార్ హీరోల సినిమాలలో ఆశించినంతగా అవకాశాలు దక్కలేదు. రీసెంట్ గా సాయి ధరం తేజ్ నటించిన ప్రతీరోజూ పండగే సినిమాతో మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా నటిస్తున్న రాశీఖన్నా తాజాగా తన బర్త్ డే సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది.
రాశీఖన్న చిన్నప్పటి నుండి చదువులో టాపర్ అని… ఐఏఎస్ కావాలన్న అభిలాష బలంగా ఉండేదని తెలిపింది. ఒకానొక దశలో పూర్తిగా పుస్తకాలకే పరిమితం అయిందట. అయితే ఐఏఎస్ కావాలన్న కోరిక మాత్రం నెరవేరలేదని తెలిపింది. అంతేకాదు సినిమా హీరోయిన్ అయ్యాక ఆ ఆలోచన మారిందని వెల్లడించింది.
ఇక 17 ఏళ్ల వయసులో ఒక సీనియర్ రాశీకి ప్రపోజ్ చేశాడట. అతనంటే ఇష్టం ఉండటం తో కొన్నాళ్ల పాటు అతనితో జర్నీ చేసిందట. కాని ఊహించని విధంగా ఆ జర్నీ మధ్యలోనే ఆగిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక తమిళంలో వరసగా సినిమాలు చేస్తున్న రాశీఖన్నా .. ఒక తెలుగు సినిమాలోనూ నటించబోతుందట. అందుకు సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే రానుందని తెలిపింది. మొత్తానికి రాశీ ఖన్నా లవ్ బ్రేకప్ అయిందన్న మాట.