కరోనా తో జనాలు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఏదో ఒక పని చేస్తున్న వాళ్ళు ఆ కాసేపు ఆదమరిచి పనిలో పడుతున్నారు గాని.. ఖాళీగా కూర్చున్న వాళ్ళు మాత్రం ఏదో ఒక కరోనా వార్త చూడడం గుండె దడ తెచ్చుకోవడం.. అందరిలో ఇదే సాధారణంగా జరుగుతున్నది.
కాస్త కఠినంగా ఉంటే కరోనా అంత ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికి భయం భయంగానే ఉంటోంది. చెప్పాలంటే ఈ విషయంలో బాగా స్ట్రెస్ అయిపోతున్నారు. కొంతమంది అయితే టీవీలు చూడాలన్నా ..ముఖ్యంగా న్యాస్ చూడాలంటే హడలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనసులోకి వేరే ఆలోచన దూరకుండా వినోదం పంచేందుకు బిగ్ బాస్ సీజన్ 4ని త్వరలో మొదలు పెట్టబోతున్నారు.
అయితే గత సీజన్స్ మాదిరిగా ఎక్కువ డ్రాగ్స్ లేకుండా ఈ సీజన్ 4 ని డిజైన్ చేస్తున్నారట. ఇక కరోనా టెన్షన్స్ బిగ్ బాస్ నిర్వాహకులపై గట్టిగానే ఉందంటున్నారు. ఇంట్లో ఒక సభ్యుడికి కరోనా పాజిటివ్ అని తేలినా అందరికీ గుండే కొట్టుకోవడం మారిపోతుంది. అందుకే వీళ్లందరినీ షో ప్రారంభానికి ముందే చాలా జాగ్రత్తగా గృహనిర్భంధంలో ఉంచారట నిర్వాహకులు. ఏ చిన్న పనిమీద అలా పక్కకెళ్ళినా..షాపుకుళ్లినా.. షాపింగుకి వెళ్లినా వెంటే బాడీగార్డులు వదిలి పెట్టడం లేదంటున్నారు. కరోనా టెన్షన్ కంటే ఎక్కువ ఇబ్బందికరంగా ఉందట.
ఇక ఇప్పటికే 16 మందిని ఎంపిక చేసి స్వీయనిర్భంధంలో ఉంచారట. వీరందరూ ఎక్కడికి కదిలే అవకాశం లేదని తెలుస్తోంది. 16మందికి కోవిడ్ 19 టెస్టులు నిర్వహించిన తర్వాత చేసి నిర్భంధంలో ఉంచారట. కాగా బిగ్ బాస్ సీజన్ 4 షో ప్రారంభానికి ఇంకా 10 రోజుల సమయం ఉండటంతోనే నిర్వాహకులు ఈ రకంగా ఏర్పాట్లు చేశారని సమాచారం. ఆగస్టు 30 నుంచి షో మొదలవుతోంది. నాగార్జున అక్కినేని హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.