పూజా హెగ్డే… ఒకేసారి ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అయితే అదే సమయంలో బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన మొహంజాదారో సినిమాలో అవకాశం వచ్చి టాలీవుడ్ లో వచ్చిన ఆఫర్స్ ని కాదనుకొని ముంబై వెళ్ళిపోయింది. అయితే ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.
దాంతో మళ్ళీ బాలీవుడ్ నుంచి అవకాశాలు రాలేదు. కాని టాలీవుడ్ లో మాత్రం దర్శకుడు హరీష్ శంకర్, దిల్ రాజు పిలిచి మరీ దువ్వాడ జగన్నాధం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకరకంగా పూజా హెగ్డే కి హరీష్ శంకర్ గాడ్ ఫాదర్ అనే చెప్పాలి. ఆయన వల్లే పూజా హెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఒక వెలుగు వెలుగుతుంది.
పూజాలోని అందాన్ని ఎలివేట్ చేసి, ఆమెలో టాలెంట్ ని మరింతగా బయటకి తీసి ఈ స్థాయికి తీసుకు వచ్చిన వాళ్ళలో మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కూడా ఉన్నారు. త్రివిక్రం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తీసిన అరవింద సమేత వీర రాఘవ లో పూజ హీరోయిన్ గా నటించింది. అరవిందగా పూజాను అందంగా చూపించడమే కాదు, పూజా క్రేజ్ మరింత పెరిగేలా చేశారు.
ఇక అల వైకుంఠపురంలో సినిమాతో పూజా హెగ్డే కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇదంతా త్రివిక్రం చలువే. ఇలా టాలీవుడ్ లో హరీష్ శంకర్, త్రివిక్రం శ్రీనివాస్ పూజా హెగ్డే కి గాడ్ ఫాదర్ అని చెప్పాలి. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం, అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలలో నటిస్తుంది. అలాగే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న తాజా చిత్రం లోను పూజా హెగ్డే ని హీరోయిన్ గా అనుకుంటున్నారట.