అమరావతి: పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ అధికారులు వినూత్న ప్రక్రియ చేపట్టారు.
కేజీ ప్లాస్టిక్ తీసుకువస్తే ఆరు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.లీవ్ ప్లాస్టిక్ అనే నినాదంతో ‘కేజీ ప్లాస్టిక్ తీసుకురండి – ఆరు కోడి గుడ్లు పట్టుకెళ్లండి’ అంటూ వినూత్న కార్యక్రమం చేపట్టగా ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది.
కోళ్ల ఫారమ్ యజమాని సుధాకరరెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిలతో కలిసి ఈ వినూత్న కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు.
ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.