కరోనా సంక్షోభం వల్ల రవాణా సర్వీసులు మొత్తం దాదాపు నాలుగు నెలలు స్తంభించాయి. నిదానంగా ఇప్పుడిప్పుడే బస్సు, ఆటోలు తిరగడం మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితమే విమాన సర్వీసులు కూడా ముమ్మరం చేశారు. ఇలాంటి సమయంలో ఇండియన్ రైల్వేస్ భారత ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది.
ఇప్పటికే ఆగస్టు 12 వరకు ఎటువంటి రైలు సదుపాయం ఉండదని స్పష్టం చేసిన ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు ఆ గడువు పొడిగించింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలాంటి రైల్వే సర్వీసులు దేశమంతటా నడవవని స్పష్టం చేశారు. అలాగే ఆ తర్వాత కూడా దశలవారీగా వదలడమే తప్పించి పూర్తిస్థాయిలో రైళ్ళు నడిచే పరిస్థితి లేదు.
ఇక రైళ్లు అక్టోబర్, నవంబర్ నెలల నుండి నడిపినా కూడా…. అక్కడ కూడా భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు తగ్గట్టు ఏర్పాటు చేసుకునేందుకు వారికి కనీసం నెల పైనే సమయం పడుతుంది.