అమరావతి: ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ప్రశంసలు కురిపించారు. మంగళవారం అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్తో కైలాస్ సత్యార్థి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పాఠశాల విద్యలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. కైలాస్ సత్యార్థితో పాటు నర్సారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు జగన్ను కలిశారు. అంతకుముందు చేబ్రోలులోని విజ్ఞాన్ యూనివర్సిటీని కైలాస్ సందర్శించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విద్యార్థులకు కైలాస్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డిని కలిసిన నోబుల్ అవార్డు గ్రహీత సత్యార్ధి కైలాస్.
పాఠశాల విద్యలో చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపి మోడల్ స్టేట్గా నిలుస్తుంది : నోబుల్ అవార్డు గ్రహీత సత్యార్ధి కైలాస్. pic.twitter.com/7gBSmNCcd0— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 21, 2020