పౌరసత్వం సవరణ బిల్లుకు నిరసనగా ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని పౌర సంఘాల వారు రిపబ్లిక్ దినోత్సవం బహిష్కరణకు పిలుపు నిచ్చారు. చాలా అజ్ఞాత సాయుధ సంస్థలు కూడా బహిష్కరణ పిలుపునిచ్చాయి. మిలిటెంట్ గ్రూప్లు బహిష్కరణ పిలుపు నివ్వడంతో ఈశాన్య రాష్ట్రాలలో భద్రతా బలగాలు హైఎలర్ట్ ప్రకటించాయి.
మణిపూర్లో అయిదు పౌరసంఘాల వారు గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. మిజోరాంలో కూడా పౌరసంఘాలు, విద్యార్ధి సంఘాల ఐక్య వేదిక బహిష్కరణ పిలుపునిచ్చింది. ఈశాన్య రాష్ట్రాలలో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం బహిష్కరణకు మిలిటెంట్ గ్రూపులు పిలుపు నివ్వడం సాధారణమే. అయితే ఈ ఏడాది పౌరసత్వం సవరణ బిల్లు కారణంగా ఈ పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. నాగాలాండ్లో నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలకు దిగింది. బిల్లు పట్ల ప్రభుత్వ వైఖరిని వెంటనే ప్రకటించాలని ఆ సంఘం డిమాండ్ చేసింది.
పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు ఇండియా పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును జనవరి ఎనిమిదిన లోక్సభ ఆమోదించింది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు దీనిని నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మేఘాలయ, మిజోరాం, మణిపూర్ ముఖ్యమంత్రులు ఈ బిల్లు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?