కొన్ని దశాబ్దాల నుండి కొలిక్కిరాని అయోధ్య సమస్య ఆగస్టు 5న ఎలాంటి అడ్డాంకులు లేకుండా తీరిపోయింది. భారతీయుల చిరకాల కల నెరవేరింది. రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగడంతో యావత్ భారతదేశంలోనే హిందువులంతా హర్షించారు. అయితే ఇదే సమయంలో భారతదేశంలో ఉన్న అయోధ్యకు దక్షిణ కొరియా దేశానికి ఉన్న బంధుత్వం గురించి న్యూస్ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కెర్లు కొడుతోంది. అదేమిటో చూద్దాం….
ఏదైనా అమ్మతో మొదలవ్వాల్సిందే…
వివరాల్లోకి వెళితే క్రీస్తుశకం 48 లో అయోధ్యలోని మిశ్రా కుటుంబానికి చెందిన యువరాణి సూరి రత్న…. అప్పటి ఆచారాలు మరియు కట్టుబాట్ల ప్రకారం తన మొదలుపెట్టిన ప్రపంచయాన పడవ ప్రయాణం సాఫీగా సాగాలని భావించి తన వెంట ఓ రెండు చేపలు ముద్దాడుతున్న రాయిని పెట్టుకుని సముద్ర మార్గం ద్వారా ప్రయాణించడాం మొదలు పెట్టింది. అలా ప్రయాణించిన ఆమె చివరకు కొరియా దేశానికి చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన యువరాణి సూరి రత్న అక్కడి సంస్కృతి కి తగ్గట్లు తన పేరుని హో వాంగ్ ఓక్ అని మార్చుకున్నారట. అలాగే కారా వంశానికి చెందిన తొలి రాజు ‘కిమ్’ ను వివాహం చేసుకుంది.
రాయి విప్పిన గుట్టు
ఇక యువరానికి, రాజు కిమ్ కు పదిమంది సంతానం .అప్పటిలో కలిసి ఉన్న కొరియా ఇప్పుడు దక్షిణ కొరియా ఉత్తర కొరియా అనే రెండు దేశాలుగా విడిపోయింది. ఇప్పటికీ రెండు దేశాలలో ఈ ‘కిమ్’కుటుంబానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే ముందు మనం చెప్పుకున్నట్లు అప్పట్లో కారా వంశానికి యువరాణి సూర్య రత్న అలియాస్ వాంగ్ తనతో తెచ్చిన రెండు చేపలు ముద్దాడుతున్న రాయి కొరియాలోది కాదని ఉత్తరప్రదేశ్లోని ప్రాంతం నుండి వచ్చిందని కిం హే అనే ఒక ఆర్కియాలజిస్టు తేల్చి చెప్పేశారు. ఇక అప్పటికే చాలామంది కొరియన్స్ భారత్ లోని అయోధ్య తన పుట్టినిల్లుగా భావిస్తున్నారు.
#WATCH: South Korean first lady Kim-Jung Sook and UP CM Yogi Adityanath perform 'Aarti' on banks of Sarayu river in Ayodhya. #diwali pic.twitter.com/OVSTaHVl6C
— ANI UP (@ANINewsUP) November 6, 2018
అదీ సంగతి
అందుకే ఏటా ఇక్కడికి వేల సంఖ్యలో ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తారు. దీని వెనుక ఉన్న అసలైన కారణం ఇది ఇప్పటికి తెలిసింది. ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సందర్భంగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మొత్తానికి అయోధ్యకి కొరియా వారికి ఉన్న సంబంధం ఏమిటో బహిర్గతం అయిపోయింది అంటూ చాలా మంది ఈ విషయాన్ని బాగా నమ్ముతున్నారు.