ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు తోడు మరిన్ని సమస్యల నడుమ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగి ఏరులై పారాయి. అలివేరు, కొండవాగు కల్వర్తర్లు కొట్టుకుపోయాయి. గోదావరి ఏజెన్సీలో ముంపు సూచికలు మొదలయ్యాయి. గిరిజన గ్రామాలకు భారీ వర్షాల వల్ల రవాణా స్థంభించించి.
ఇక పోతే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో గుంటూరు లోని లోతట్టు ప్రాంతాలు అన్నీ మునిగిపోయాయి. పాత భవనాల్లో ఉంటున్నా స్థానికులు మరియు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు ఊరు ఖాళీ చేసి తాత్కాలికంగా వేరేచోట నివాసం ఉండేందుకు వెళ్తున్నారు. ఇక అస్థిర భవనాల్లో ఉంటున్నవారు అయితే ఆ వర్షానికి తీవ్ర భయానికి లోనై అప్పటికప్పుడు ఇళ్లలో నుంచి బయటికి వెళ్లిపోయారు.
ఇక కృష్ణ, గోదావరి బెల్ట్ లో ఉండే జనాలు ముంపు కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?