రామ్ రీసెంట్ గా రెడ్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ram మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలన్న కసితో red సినిమా చేశాడు. రెండు సినిమాలతో మంచి మాస్ హిట్స్ అందుకున్న ram నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు మళ్ళీ మాస్ కథతోనే వస్తాడా లేక రెండు మాస్ సినిమాలు చేశాడు కాబట్టి ఈసారి క్లాస్ కథ ఎంచుకుంటాడా అన్న టాక్ కూడా ఉంది.
అయితే ram red తర్వాత అఫీషియల్ గా ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో క్లారిటీ లేకపోయినప్పటికి మరోసారి పూరి జగన్నాధ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. అలాగే మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ram నెక్స్ట్ సినిమా ఉండబోతుందన్న ప్రచారం సాగుతోంది. ఇదే కాదు రీసెంట్ గా మాస్ మహారాజ రవితేజ కి క్రాక్ రూపంలో భారీ కమర్షియల్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని పేరు ప్రచారంలో నిలిచింది. ఖచ్చితంగా ram నెక్స్ట్ సినిమా ఈ ముగ్గురిలో ఒకరి తో ఉంటుందన్న మాట మాత్రం స్ట్రాంగ్ గా వినిపించింది.
అయితే ఈ ముగ్గురు పేరు కాదని ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆర్.టి.నీసన్ దర్శకత్వంలో ram నెక్స్ట్ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని లేటెస్ట్ అప్డేట్. స్టార్ విజయ్- మోహన్ లాల్ లతో జిల్లా అన్న సినిమా చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు r.t neesan. ఇక రీసెంట్ గా ఆర్.టి.నీసన్ మాస్ షేడ్స్ ఉన్న కథ తో ram ని కలిసి కథ నరేట్ చేశాడట. ఈ కథ రామ్ కి బాగా నచ్చడం తో చేద్దామన్న మాట్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా రానుందని లేటేస్ట్ న్యూస్. మరి ఇది నిజామా కాదా అన్నది తెలీదు గాని ఇన్నాళ్ళు ఫ్యాన్స్ అనుకున్న దానికి రివర్స్ లో జరగడం మాత్రం షాకింగ్ విషయమే.