ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిలో కంటి వైద్య నిపుణుల పోస్టులు భర్తీ చేస్తున్నది.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కింద ఖాళీగా ఉన్న పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయటకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. మొత్తం 43 పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
విభాగాలు :
ఆప్తాల్మిక్ అసిస్టెంట్ – 43
అర్హతలు :
ఎంపీసీ , బైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియట్ ఉతీర్ణత సాధించాలి . గుర్తింపు పొందిన సంస్థ నుంచి పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్స్, బిఎస్సి ఆప్టోమెట్రీ, డిప్లమో ఆప్టోమెట్రీ టెక్నీషియన్, డిప్లమో ఆప్టోమెట్రీ ఉతీర్ణత.
వయస్సు : 18-40 ఏళ్ళు మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా
వేతనం : రూ. 15,000/-
దరఖాస్తులకు చివరి తేదీ : 04/01/2021.