Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య బాబు సినిమాలు చేసే విషయంలో స్పీడ్ వయసుతో నిమిత్తం లేకుండా ఉంటుంది. చాలా ఇంటర్వ్యూలలో సంవత్సరానికి నాలుగు సినిమాలు విడుదల చేయడానికి కూడా నేను రెడీ. దర్శకుడు ముందుకు రావాలి అంటూ ఓపెన్ గానే ప్రకటించడం జరిగింది. ఆ రీతిగానే ఇప్పుడు బాలయ్య బాబు కరోనా పాండమిక్ తర్వాత సినిమాలో ఒప్పుకోవటంలో మంచి స్పీడ్ మీద ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో “అఖండ”(Akhanda) సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య బాబు.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ ఉండటం తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గోపీచంద్ మలినేని.. సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ చేస్తుండగా మరో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఇటువంటి తరుణంలో బాలయ్య బాబు కరోనా బారిన పడటం తెలిసిందే. ఒకపక్క కరోనా అటాక్ అయినా గాని.. బాలయ్య తగ్గదేలే అనే తరహాలో… సినిమాలు కథలు వినే పని పెట్టుకున్నారట. గతంలో టైం లేకపోవడంతో స్టోరీలు.. కొన్ని పక్కన ఉండటంతో వాటికి సంబంధించిన దర్శకులతో.. బాలయ్య బాబు టచ్ లోకి వచ్చినట్లు లేటెస్ట్ టాక్.
జూమ్ లో బాలయ్య బాబు.. తనతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్న దర్శకులు చెబుతున్న స్టోరీలను వింటున్నారు అంట. ఈ క్రమంలో “రచ్చ”(Rachha) సినిమా డైరెక్టర్ సంపత్ నంది చెప్పిన స్టోరీ లైన్ బాలయ్య బాబుకి నచ్చినట్లు.. వార్తలు వస్తున్నాయి. అంతా కుదిరితే సంపత్ నంది సినిమా చేస్తున్న రెండు సినిమాల తర్వాత బాలయ్య చేసే అవకాశం ఉన్నట్టు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే కరోనా నేపథ్యంలో .. ఖాళీ దొరకటంతో.. బాలయ్య స్టోరీలు వింటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు సమాచారం.