Pawan Kalyan: మహమ్మారి కరోనా వచ్చాక పరిస్థితులు మొత్తం తలకిందులైన సంగతి తెలిసిందే. కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంతో.. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియా లో రిలీజ్ చేస్తూ సినిమాలపై హైప్ పెంచేస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది టాప్ హీరోల టీచర్లు ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల అవుతున్న తరుణంలో అభిమానులు .. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సరికొత్త రికార్డులు..వ్యూస్, లైక్స్ ద్వారా క్రియేట్ చేస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న RRR, లెజెండ్, పుష్ప, “సర్కారు వారి పాట” సినిమాలకు సంబంధించిన టీజర్ లు వీడియోలు అదే రీతిలో పోస్టర్లు అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. రీసెంట్ గా మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా టీజర్ తో.. మహేష్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ అభిమానులు వంతు వచ్చింది.
ఆదివారం పవన్ రానా మల్టీస్టారర్ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ తో కూడిన టైటిల్ ప్రకటించనున్నట్లు.. సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటల 45 నిమిషాలకు రెడీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ అప్ డేట్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలావరకు మహేష్ సినిమా సర్కారు వారి పాత సినిమా పై ఎక్కువ రికార్డులు నమోదు అయి ఉండటంతో వాటిని బద్దలు కొట్టే రీతిలో.. ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.