Prabhas: పాన్ ఇండియన్ ప్రభాస్ 5 భారీ ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. పక్కా ప్లాన్తో ఒక్కో సినిమాను కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. చెప్పాలంటే ప్రభాస్ పూర్తి చేస్తున్నంత స్పీడ్గా మరో హీరో చేయడం లేదనే చెప్పాలి. కరోనా వేవ్స్ గనక లేకపోయి ఉంటే సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో అభిమానులకు ప్రామిస్ చేసినట్టుగానే ఏడాదిలోపే ఓ సినిమాను తీసుకువచ్చేవాడు. ఇక ఇప్పటికే రాధే శ్యామ్ సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ సినిమాలతో పోటీగా దింపుతున్నాడు. జనవరి 14న ఈ సినిమా 7 భాషలలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
ఇటీవల బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ సలార్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న మైల్ స్టోన్ మూవీ ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్లో జాయిన్ అవుతున్నాడు. డిసెంబర్ 5నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో, అన్నపూర్ణ స్టూడియోస్లలో వేసిన ప్రత్యేకమైన సెట్స్లో చిత్రీకరణ జరగనుంది. ఇక సైన్స్ ఫిక్షన్ కథాంశంతో పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు మహానటి ఫేమ్మ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Prabhas: కొట్టకపోతే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రభాస్ పార్ట్ షూటింగ్ కంప్లీట్..!
ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకొణ్ ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుంది. రేపటి నుంచి ప్రభాస్ – దీపిక పదుకొణ్ మీద కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మళ్ళీ కరోనా గనక దెబ్బ కొట్టకపోతే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రభాస్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ప్రముఖ నిర్మాత సి అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.