ఢిల్లీ, జనవరి 11: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ ఎక్సేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ చైర్మన్ అశోక్ చావ్లా తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.
ఎయిర్ సెల్-మాక్సిస్ కేసులో ఆయన్ను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రం అనుమతించిన కొద్ది గంటల వ్యవధిలో ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనకు వ్యతిరేకంగా సి.బి.ఐ ప్రాసిక్యూట్ చేయడానికి సిద్ధమైంది.
మాజీ ఆర్థిక కార్యదర్శి అయిన చావ్లా 2016 మార్చి 28 నుండి ఎన్ఎస్ఈ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత నవంబర్ లో ఎస్ బ్యాంక్ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేశారు.