NTR 100th Birth Anniversary: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ లు పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటున్నారు. అంతకు ముందే నందమూరి లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్ప గుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదే విధంగా నందమూరి రామకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు, దగ్గుబాటి పురందరేశ్వరి దంపతులు, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఏపీ, తెలంగాణలో వచ్చే ఏడాది మే 28వరకూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరుపుతామని దగ్గుబాటి పురందరేశ్వరి తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశామనీ, కమిటీలో నందమూరి బాలకృష్ణ, రాఘవేంద్రరావు తదితర ప్రముఖులు ఉన్నారని పురందరేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఫోర్ట్ ల్యాండ్ ఎన్ఆర్ఐ టిడీపీ అందజేస్తున్న కుట్టు మిషన్లు, వీల్ చైర్లు, దుప్పట్లును ఎన్టీఆర్ ఘాట్ వద్ద లబ్దిదారులకు పురందరేశ్వరి అందజేయనున్నారు.
కాగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని తారక్ … సదా మీ సేవలో అంటూ ఎన్టీఆర్ ఫోటోను ట్వీట్ చేశారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానుక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను” అని రాసుకొచ్చారు తారక్.
సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP
— Jr NTR (@tarak9999) May 28, 2022