Teja : తేజ.. టాలీవుడ్ లో సెన్షేషనల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు. డెబ్యూ సినిమా చిత్రంతో తేజ క్రియేట్ చేసిన కొత్త ట్రెండ్ ఆ తర్వాత చాలా ఏళ్ళు కొనసాగింది. ఆయన రూట్లోనే చాలా మంది దర్శకులు సినిమాలు తీశారు. కానీ ఆయన మాదిరిగా ఇండస్ట్రీకి కొత్త వాళ్ళని మాత్రం పరిచయం లేకపోయారు. తేజ కెరీర్ ప్రారంభంలో తీసిన చాలా సినిమాల ద్వారా టాలీవుడ్కి దాదాపు 40 నుంచి 45 మందిని పరిచయం చేశాడు. అలా వచ్చి స్టార్ అయిన వాళ్ళే కాజల్ అగర్వాల్, నితిన్, సదా, నవదీప్, సుమన్ శెట్టి లాంటి వాళ్ళు.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సీనియర్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. నితిన్ పెద్ద స్టార్ అయ్యాడు. నవదీప్ కూడా మంచి రోల్స్ చేస్తూ ఫాంలో ఉన్నాడు. అయితే గత కొంత కాలంగా తేజ కొత్త వాళ్ళతో కాకుండా స్టార్స్ తో సినిమాలు తీస్తూ వస్తున్నాడు. ఆ మధ్య రానా దగ్గుబాటితో నేనే రాజు నేనే మంత్రి సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సీత తీసి మళ్ళీ సక్సస్ ట్రాక్ మిస్ అయ్యాడు. కాగా మళ్ళీ గోపీచంద్ హీరో ఒక సినిమా.. రానా హీరోగా ఒక సినిమా ప్లాన్ చేసుకున్న తేజ టైటిల్స్ కూడా చెప్పేశాడు.
Teja : ‘చిత్రం మూవీస్’ బ్యానర్ లో ఎన్టీఆర్ బావమరిది..?
అయితే ఈ ప్రాజెక్ట్స్ కంటే ముందే మళ్ళీ కొత్త వాళ్ళతో ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా ‘చిత్రం’ సినిమా సీక్వెల్ చిత్రం 1.1 అని ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో హీరోగా దగ్గుబాటి హీరో రానా తమ్ముడు అభిరాం హీరో అని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం తేజ చిత్రం సీక్వెల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర హీరోగా పరిచయం కానున్నాడని తెలుస్తోంది. తేజ హోమ్ ప్రొడక్షన్ హౌస్ ‘చిత్రం మూవీస్’ బ్యానర్ లో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవబోతోందని సమాచారం.