నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత సీఎం నందమూరి తారక రామారావు నాల్గవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (52) జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో ఉరి వేసుకుని మృతి చెందారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం అవ్వగా, చిన్న కుమార్తెకు ఇటీవలే పెళ్లి చేశారు. చిన్న కుమార్తె వివాహం తర్వాత ఉమామహేశ్వరి తీవ్ర మానసిక ఒత్తిడి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలకు తోడు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఉమామహేశ్వరి మృతి సమాచారం తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, భూవనేశ్వరి, నారా లోకేష్, బ్రహ్మణి తదితర కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి నివాసానికి చేరుకున్నారు. విదేశాలలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?