NTR : స్మాల్ స్క్రీన్ మీద, ఎంటర్టైన్మెంట్ షోస్ కి, క్విజ్ షోస్ కి ప్రేక్షకుల్లో ప్రస్తుతం ఉన్న ఆదరణ అసాధారణం. తెలుగు ప్రేక్షకులలో కాంపిటీటివ్ స్పర్టివ్ నెస్ ని నింపేందుకు ఈ షోలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రారంభంలో క్విజ్ ఎంతో ఈజీగా అనిపిస్తున్నా.. ఆ తర్వాత షో రన్ సాగే కొద్దీ నెమ్మదిగా కష్టతరమైన ప్రశ్నలతో సవాల్ గా మారుతుంది. షో పార్టిసిపెంట్స్ మేధస్సును బయటకి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశం ఎంతో ఉత్కంఠతను పెంచుతాయి. కోటి రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకునే సత్తా ఉన్న విజ్ఞాని ఎవరు? అనేది తెలుసుకోవాలన్న ప్రేక్షకుల్లో ఉండటంతో భారీ స్థాయిలో వ్యూవర్ షిప్ రాబడుతుంది.
ఇప్పటికే ఈ విషయం పలు రియాలిటీ షోస్ ద్వారా తెలిసింది. ఇదే క్రమంలో బాలీవుడ్ లో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ పెద్ద సక్సెస్ గా నిలిచింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ షోని బుల్లితెరపై చాలా కాలంగా విజయవంతంగా నడిపించి గొప్ప పేరు పొందారు. ఈ కౌన్ బనేగా కరోడ్ పతి ఇన్స్పిరేషన్ తోనే తెలుగులోనూ క్విజ్ షో మొదలైంది. తెలుగు రాష్ట్రాలలో టీవీ సీరియళ్ళు కూడా కాదని ‘మీలో ఎవరు కోటీశ్వరులు షో’ బాగానే సక్సెస్ అయింది. మా టీవీలో ప్రసారమైన ఈ షోకి నాగార్జున రెండు సీజన్లను నడిపించాడు. మూడవ సీజన్ ని మెగాస్టార్ నడిపించారు.
NTR : గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్
అయితే స్టార్ మా ఈ షోను రద్దు చేసిన నేపథ్యంలో మరో ప్రముఖ ఛానల్ జెమినీ టేకోవర్ చేసి త్వరలో ప్రసారం చేయబోతోంది. ఇప్పటికే దీని ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ షో కరోనా కారణంగా ఆగిపోయింది. కాగా త్వరలో ప్రసారం కాబోతున్న దీనికి పేరు కూడా మారింది. మీలో ఎవరు కోటీశ్వరులు కాస్త ఎవరు మీలో కోటీశ్వరులుగా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్న ఈ షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ రాబోతున్నట్టు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది.