ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పోరాట యోధుడు కొమరం భీం గా నటిస్తున్నాడు ఎన్.టి.ఆర్. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన రామరాజు ఫర్ భీమ్ టీజర్ తో ఎన్.టి.ఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రభాస్ తర్వాత పక్కా పాన్ ఇండియన్ స్టార్ గా ఆ రేంజ్ క్రేజ్ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తరువాత ఎన్.టి.ఆర్ సాధించడం ఖాయమని అంటున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు ఎన్.టి.ఆర్. అయితే కరోనా కారణంగా ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లేట్ అవుతూ ఉండడంతో..సమ్మర్ వరకు ఎన్.టి.ఆర్ ఖాళీ అయ్యే సూచనలు లేకపోవడం తో ఈ గ్యాప్ లో ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక సినిమా కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. సమ్మర్ లోపు రామ్ – త్రివిక్రమ్ ల సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అప్పటికి ‘ఆర్.ఆర్.ఆర్’ కంప్లీట్ అవుతుంది కాబట్టి సమ్మర్ నుంచి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా మొదలవుతుందని అంటున్నారు.
కాగా ఈ సినిమాని హారిక అండ్ హాసిని – ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించేందుకు యూనివర్సల్ పాయింట్ తో త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ‘అరవింద సమేత’ లో ఎన్టీఆర్ – పూజా హెగ్డే కాంబినేషన్ అదిరిపోయింది. అందుకే ఈ ప్రాజెక్ట్ లో కూడా పూజా నే హీరోయిన్ అనుకుంటున్నారు.
కాని తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట లో హీరోయిన్ గా ఎంపికైంది కీర్తి సురేష్. అయితే ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ మాత్రం కీర్తి సురేష్ హీరోయిన్ అంటే టెన్షన్ పడుతున్నారట. అందుకు కారణం ఇప్పుడు కీర్తి సురేష్ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్నాయి కాబట్టి. మరి నిజంగా మేకర్స్ కీర్తి నే ఎంచుకోవాలనుకుంటున్నారా లేదా అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.