NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ నేపథ్యం కలిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో ముందు వరుసలో ఉన్న హీరో ఎన్టీఆర్. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నా గాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఇమేజ్ లేదా ఫాలోయింగ్ మరో హీరోకి లేదని చెప్పవచ్చు. ఆ రీతిగా సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులను అలరిస్తూ.. అదిరిపోయే స్టెప్పులు తో పాటు డైలాగులతో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా ఫుల్ ఎనర్జీ తో… సిల్వర్ స్క్రీన్ పై ఎన్టీఆర్ అలరిస్తున్నాడు.
ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క బుల్లితెరపై కూడా కొన్ని షోలు చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR చేసిన ఎన్టీఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన కెరియర్ లో 30 సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇదిలాఉంటే అభిమానులను బాగా ప్రేమించే హీరోల లో ఫస్ట్ ప్లేస్ లో ఎప్పుడూ ఎన్టీఆర్ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. వాళ్ల యోగక్షేమాలను వీలైనంతవరకు తెలుసుకుంటూ తనని కలిసే వారికి.. ఎంతో ఆప్యాయతలు పంచి ఎన్టీఆర్ తాజాగా.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ అభిమాని చివరి కోరిక తీర్చడం జరిగింది.
ఎన్టీఆర్ స్వయంగా వీడియో కాల్
విషయంలోకి వెళితే ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమాని కోరిక తీర్చాడు ఎన్టీఆర్. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మురళి అనే వ్యక్తి ఇటీవల ప్రమాదానికి గురి కావడంతో రెండు కిడ్నీలు దెబ్బతినడం తో విజయవాడ రమేష్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న తరుణంలో ఎన్టీఆర్ ని చూడాలని మాట్లాడాలని మాట్లాడలేని సందర్భంలో పేపర్ పై తన కోరిక తన చుట్టుపక్కల వారికి తెలియజేశాడు. ఈ విషయం ఎన్టీఆర్ దాకా చేరటంతో… ఎన్టీఆర్ స్వయంగా వీడియో కాల్ చేసి అతనితో మాట్లాడి.. యోగక్షేమాలు అడిగి ధైర్యం చెప్పాడు. ఏం కాదు త్వరలో కోలుకొని.. బయటకు వచ్చేస్తారు అంటూ తన అభిమానికి ఎన్టీఆర్ ధైర్యం చెప్పాడు. ఈ తరుణంలో తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకుని మురళికి ధైర్యం చెప్పడంతో పాటు బాసటగా నిలిచారు.