Ntr : ఎన్టీఆర్.. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే టక్కున ప్రశాంత్ నీల్ పేరే వినిపిస్తోంది. యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వసూళ్ల వర్షం కురిపించడంతో ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. కేజిఎఫ్ కు వచ్చిన క్రేజ్ ను కాష్ చేసుకునేందుకు కేజిఎఫ్ 2 ను రూపొందిస్తున్నారు. కేజిఎఫ్ 2 ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యన రిలీజ్ అయిన టీజర్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.
అందుకు తగ్గట్టుగానే ఈ స్టార్ డైరెక్టర్ మూవీ పాన్ ఇండియన్ లెవెల్ లో కేజిఎఫ్ కు మించి క్రేజ్ తెచ్చేందుకు కష్టపడుతున్నాడు. రీసెంట్ గానే మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవుతున్నాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.కేజిఎఫ్ 2 సెట్స్ మీద ఉండగానే డార్లింగ్ ప్రభాస్ తో పాన్ ఇండియన్ సినిమాకి ప్లాన్ చేసాడు ప్రశాంత్ నీల్. సలార్ మూవీ తో వరల్డ్ వైడ్ గా హల్ చల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇలా ఉండగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియా లో ఓ వార్త వైరల్ అవుతోంది.
Ntr : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ సినిమా మొదలవబోతుందట..?
ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. యంగ్ టైగర్ – ప్రశాంత్ నీల్ కాంబో అంచనాలను మించిపోతుంది ఫ్యాన్స్ ఫుల్ ఖుషి చేసుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరూ రెండు మూడు సార్లు మీట్ అయ్యారు. ప్రాజెక్ట్ పైనే చర్చించారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రజంట్ ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ 2, సాలార్ సినిమాల పనుల్లో బిజీ గా ఉన్నాడు. అదేవిధంగా ఎన్్టి్ఆర్.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉండగా నెక్స్ట్ త్రివిక్రం సినిమా చేయబోన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ సినిమా మొదలవబోతుందట. అయితే ఈ లోపు భారీ సర్ప్రైజ్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తారని టాక్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?