ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చాప్టర్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ – యష్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ సినిమాకి దేశవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ – హీరో యశ్ పాన్ ఇండియన్ హీరో, దర్శకుడు గా మారారు. దాంతో కేజీఎఫ్ చాప్టర్ 2 ని ఇంకా భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.
ఈ క్రమంలో దేశం మొత్తం కేజీఎఫ్-2 కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కేజీఎఫ్2 నుంచి సర్ ఫ్రైజ్ రాబోతుందంటున్నారు. జనవరి 8న చిత్ర టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. యష్ బర్త్ డే కానుకగా కేజీఎఫ్-2 టీజర్ రానుందని అంటున్నారు.
ఇక తాజాగా ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ అన్న భారీ యాక్షన్ సినిమా తెరకెక్కబోతున్నట్టు ప్రకటించారు. చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ అని చెప్పాలి. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఎన్.టి.ఆర్ దర్శకత్వంలో ఉంటుందని ఇన్నాళ్ళు వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్టు ప్రచారం జరిగింది.
కాని భారీ షాక్ ఇస్తూ కేజీఎఫ్ నిర్మాతలు ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. దాంతో ఇప్పుడు అందరూ ఈ ప్రాజెక్ట్ లేదా అని మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఎన్.టి.ఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. కాగా ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సలార్ జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుందని సమాచారం. 2022 లో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు.