NTR : ఎన్.టి.ఆర్ .. సంధ్యరాజు నటిస్తున్న నాట్యం సినిమా టీజర్ ని తాజాగా రిలీజ్ చేశాడు. ఈ మధ్య టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ సహా దాదాపు అందరు హీరోలు చిన్న సినిమాలకి ఆ సినిమాలలో నటించే నటీ, నటులకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అడగగానే చిన్న హీరోలు నటిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్.. టీజర్ .. ట్రైలర్స్ ని రిలీజ్ చేసి సినిమా ని బాగా సపోర్ట్ చేయడమే కాదు తమవంతు బాధ్యతగా ప్రమోట్ కూడా చేస్తున్నారు. ఈ ప్రమోషన్ చిన్న సినిమాలకి బాగా ఉపయోగపడుతోంది.
ఈ క్రమంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సంధ్యరాజు నటిస్తున్న లేటెస్ట్ సినిమా నాట్యం టీజర్ ని రిలీజ్ చేశాడు. ఎన్.టి.ఆర్ కూచిపూడి నాట్యం నేర్చుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోలలో ఎన్.టి.ఆర్ డాన్స్ ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. నాట్యం మీద విపరీతమైన మమకారం ఉంటుందని ఇప్పటికే ఎన్నో సందర్భాలలో ఎన్.టి.ఆర్ తెల్పాడు. ఈ ఇష్టం తోనే నాట్యం టీజర్ ని రిలీజ్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక తాజాగా రిలీజైన నాట్యం టీజర్ కి పలువురు సినీ ప్రముఖుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి.
NTR : ఈ ఒక్క డైలాగ్ తో సినిమా ఎలా ఉంటుందో తెలుస్తోంది.
నాట్యం ప్రధానంగా సాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మెగా పవర్ స్టార్ రాం చరణ్ సతీమణి ఉపాసన రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీజర్ ని ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయడంతో సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకి రేవంత్ కొరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. మల్టీ టాలెంటెడ్ అయిన రేవంత్ కొరుకొండ నాట్యం సినిమాకి రచన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించడం ఆసక్తి కరం. ‘మనం వినే కథను మన కళ్ళకు చూపిస్తే నాట్యం అంటాం.. నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం’ అన్న డైలాగ్ తో టిజర్ మొదలవుతుంది. ఈ ఒక్క డైలాగ్ తో సినిమా ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.