జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో అటు వెండి తెరపై మరియు బిగ్ బాస్ షో తో ఇటు బుల్లితెర పై కూడా నిరూపించుకున్నాడు. సినిమాలలో నవరసాలూ పలికిస్తూ చెలరేగిపోయే జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర పై బిగ్ బాస్ షో హోస్ట్ చేసి తనదైన ముద్ర వేస్తున్నాడు. ‘బిగ్ బాస్’ షో ఫస్ట్ సీజన్ లో హోస్ట్ గా ఉండి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు తారక్.
తాజాగా జెమినీ టీవీ కూడా ఓ కొత్త షో ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. బిగ్ బాస్ సీసన్ 1 సక్సెస్ చూసి ఈ షో కి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ను జెమినీ టీవీ వారు ఎంచుకున్న విషయం విదితమే.
జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో ను హోస్ట్ చేసేందుకు తారక్ ఇప్పటికే సైన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం మరో రెండు నెలల్లో ఈ షో షూట్ ప్రారంభంకానున్నది. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ షో గురించి ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి.
కొంచెం సీరియస్ నెస్ కొంచెం డ్రామా తో ఒక క్విజ్ షో లాగా ఈ షో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ షో లో మొత్తం 60 ఎపిసోడులు ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి ప్రతి ఎపిసోడుకి రూ.30 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద 60 ఎపిసోడ్లకు గాను రూ.18 కోట్లు తీసుకోనున్నాడు తారక్. తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఏ నటుడు అందుకొని రెమ్యూనరేషన్ ఇప్పుడు తారక్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో తారక్ బిజీగా ఉన్నాడు. రాజమౌళి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఈ సినిమా షూట్ ని కంప్లీట్ చేసిన తరువాతే జూనియర్ ఎన్టీఆర్ జెమినీ సెట్లో అడుగుపెట్టనున్నాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?