(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విశాఖపట్నంలో రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహం ఒకటి మాయం కావడం కలకలం రేపుతోంది. మధురవాడ మార్కెట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు పెకలించి పట్టుకుపోయారు. నిన్నటి వరకు కనిపించిన విగ్రహం తెల్లవారేసరికి మాయం కావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.