NTR : తెలుగు టెలివిజన్ రంగంలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన షో లలో ప్రముఖమైన షో “మీలో ఎవరు కోటీశ్వరుడు”. ఈ షో కి మొదటి లో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేశారు. అద్భుత రీతిలో నాగార్జున, చిరంజీవి షో నడిపించడంలో సక్సెస్ అయ్యారు. ఒకపక్క నాలేజ్ మరోపక్క ఎంటర్టైన్మెంట్ అందించే ఈ షో ద్వారా అప్పట్లో టెలివిజన్ రంగంలో టిఆర్పి రేటింగ్ లో భారీ స్థాయిలో నమోదు అయ్యాయి.
చిన్న వాళ్ళు మొదలుకొని పెద్ద వాళ్ళు వరకు ఈ షో ని చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఎన్టీఆర్ హోస్ట్ గా చేయటానికి రెడీ అయ్యారట. ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ఈ షో..వచ్చే వేసవి కాలం నుండి అనగా మే నెల నుండి ప్రసారం కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు కోటికిపైగా రెమ్యూనరేషన్ ఎన్టీఆర్ తీసుకుంటున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ షో గత ఏడాది ప్రసారం కావాలంట. కానీ మహమ్మారి వైరస్ రావడంతో పరిస్థితి అంతా మారిపోవడంతో..ఈ వేసవికి ప్లాన్ చేశారట. మే నెల అంటే ఇంకా మధ్యలో రెండు మాసాలు ఉండటంతో..ఫుల్లుగా పబ్లిసిటీ ఇవ్వటానికి తాజాగా ఈ షో కి సంబంధించి ప్రోమో లో ఎన్టీఆర్ నటిస్తున్నాడట. అన్నపూర్ణ స్టూడియోలో ప్రోమో కి సంబంధించిన షూటింగ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో జరుగుతుందట. త్వరలోనే అధికారికంగా ఈ షో ద్వారా మీలో ఎవరు కోటీశ్వరుడు కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్నట్లు..సదరు చానల్ ప్రసారం చేయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.