రాజకీయ విశ్లేషకుడు, సినిమా వ్యక్తి నూతన్ నాయుడును ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీకాంత్ అనే దళిత యువకుడి శిరోముండనం కేసు వ్యవహారంలో నూతన్ నాయుడును ఈరోజు విశాఖ పోలీసులు ఉడిపిలో అరెస్ట్ చేసారు. అత్యంత హేయంగా శిరోముండనం జరగడంతో నూతన్ నాయుడు భార్యతో సహా పలువురిని అరెస్ట్ చేసారు.
ఆ సమయంలో నూతన్ నాయుడు అక్కడ లేకపోయినా వీడియో కాల్ ద్వారా ఆ ఘటనను వీక్షించినట్లు తెలుస్తోంది. అలాగే నూతన్ నాయుడు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో ఫోన్లు చేస్తూ పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది అధికారులకు నూతన్ నాయుడు ఫోన్లు చేసినట్లు విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించడం గమనార్హం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?