ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే కొవిడ్-19 వైరస్ దరిచేరదు అన్న సంగతి అందరికి తెలిసిందే . ఈ విషయం తెలిసాక అనేక రకాలుగా ఇమ్యూనిటీ ని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టాము. సీతాఫలం లో కూడా మంచి ఇమ్యూనిటీ పెంచే లక్షణం ఉంది.
ఏ కాలం లో వచ్చే పండ్లూ కూరగాయల్ని ఆ కాలంలో తీసుకోవడం వల్ల సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది. సమతులాహారానికి ఉదాహరణగా ఈ పండుని చెబుతారు. ఇందులో కాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివన్నీ సరైన క్వాంటిటీలో ఉంటాయి.
సీతాఫలంలో ఉండే ఫైబర్, మినరల్స్ వల్ల ఈ పండు అరుగుదలకి తోడ్పడుతుంది. బౌల్ మూమెంట్కి సహకరిస్తుంది. తద్వారా, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు దూరమౌతాయి. అంతే, కాకుండా డయేరియా లాంటి ప్రాబ్లంస్ కి కూడా ఈ పండు చెక్ పెడుతుంది.సీతాఫలంలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ విటమిస్న్ వయసు మీద పడకుండా చేస్తాయి.
ఈ పండులో ఉండే యాంటీ-ఏజీయింగ్ ప్రాపర్టీస్ వలన స్కిన్ మంచి గ్లో తో ఉంటుంది. ఈ పండు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి సెల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.సీతాఫలం చూడడానికి కూడా హృదయాకారంలో ఉంటుంది. అందుకే ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూస్తుంది. అందువల్ల రక్తహీనత / ఎనీమియా దరి చేరదు. హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయి.
చాలా రకాల పండ్ల లాగానే సీతా ఫలం లో కూడా శరీరాన్ని చల్లబరిచే గుణాలున్నాయి.బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది. ఈ పండ్లలోని విటమిన్ A… మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మన కంటి చూపు కూడా మెరుగవుతుంది. ఇందులోని విటమిన్ B6… ఆస్తమాకి చెక్ పెడుతుంది. అయితే ఆస్తమా ఉన్నవారు డాక్టర్ సలహా తో మాత్రమే దీన్ని తీసుకోవాలి.
విటమిన్ ఎ కలిగి ఉండటంతో కంటిచూపు బాగుండేందుకు తోడ్పడుతుంది. వెంట్రుకలు గట్టిగా ఉండటానికి… చుండ్రును దూరం చేసుకోవడానికి… వెంట్రుకలు నల్లగా ఉండటానికి కూడా సీతాఫలం సహకరిస్తుంది. గర్భిణీలు ఈ పండును తీసుకుంటే వాళ్లకు ఎన్నో లాభాలుఉన్నప్పటికీ పరిమితం గానే తినాలి. గర్భంలోని శిశువు జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఇది దోహదపడుతుంది. డెలివరీ తర్వాత తల్లులకు తొందరగా పాలు రావాలంటే ఈ పండు తీసుకుంటే మంచిది.
మధుమేహ వ్యాధి గ్రస్తులు, వూబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాతో తీసుకోవాలి.సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. పిసిఒడి ఉన్న మహిళలకుకూడా సీతాఫలం చాల మంచిది.ఎందుకంటే వారికీ ఐరన్ చాలా అవసరం. అందుకు మంచి మూలం సీతాఫాలం , పిసిఓడి ఉన్న మహిళలు సీతాఫలం తినవచ్చని పోషకాహార నిపులు చెబుతున్నారు. ఇది సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది, అలసటను తగ్గిస్తుంది మరియు చిరాకును తగ్గిస్తుంది. సీతాఫలంను తినడం లో ఏదైనా సందేహం ఉంటె డాక్టర్ నికలిసి సలహా తీసుకోండి.