పేరుగు రుచేవేరు..గడ్డపెరుగు వేసుకుని ఆవకాయా నంజుపెట్టుకుని తింటే..దానిముందు ఎలాంటి ఆహారము తక్కువే అనిపిస్తుంది…చాలా మందికి భోజనం ఆఖరు లో పెరుగన్నం తినకపోతే భోజనం తిన్నట్టు అనిపించదు కూడా. అంతగా ఆహారం లో భాగమైపోయిన్ది. శరీరానికి కావల్సిన పోషకాలు పెరుగులో పుష్కలంగా ఉంటాయి.
పెరుగు తినడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. పెరుగు తినడం వలన జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా వలన పేగులకు, జీర్ణశయానికి మేలు చేస్తుంది. క్యాన్సర్లను సైతం అడ్డుకునే శక్తి పెరుగులో ఉండే ఔషధ గుణాలకు ఉందని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది అందులో సందేహమే లేదు. కానీ రాత్రిపూట కొంతమంది తినొచ్చు అంటారు… ఇంకొంతమంది అస్సలు తినకూడదు అంటారు.అసలు ఇందులో ఏది నిజమో తెలుసుకుందాం.
పాలు, పెరుగు, పాలపదార్థాల్లో కాల్షియం, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి ఎముకలకి బలాన్నిస్తాయి. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఈ పాలపదార్థాలు తీసుకుంటారు. శాఖాహారులకి పాల ఉత్పత్తులు చాలా మంచిది. కానీ రాత్రిపూట పెరుగు తినడం జలుబు చేస్తుందని శ్వాససంబంధిత, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే ఇందులో నిజం లేదని చెబుతున్నారు నిపుణులు.
ఎలాంటి వారైనా రాత్రిపూట పెరుగు తీసుకోవచ్చనిఅలా తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయని చక్కగా నిద్రపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే మరి గడ్డపెరుగులా కాకుండా కాస్తా పలుచ గా మజ్జిగ లా చేసుకుని తాగితే మంచిది. ఆ వేసుకునే పెరుగు కూడా మరీ చల్లగా, ఫ్రిజ్లో పెట్టింది కాకుండా మాములు టెంపరేచర్లో ఉండాలి. అప్పుడే ఎలాంటి సమస్య రాదు. అది అసలు సంగతి ఏవేవో కారణాలు చెప్పి ఆరోగ్యాన్నిచ్చే పెరుగుని పక్కన పెట్టేయకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయండంటూ న్నారు నిపుణులు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?