పచ్చి రొయ్య లను మాంసాహారులు అమితంగా ఇష్టపడతారు. ఇవి రుచిగాఉండడం తో పాటు ఆరోగ్యానికి ఎంతోమంచిది. రొయ్యల్లో ఒమేగా3 ప్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల అవి గుండె రక్త నాళాల్లు మూసుకుపోకుండా రక్షణ కల్పిస్తాయి. ఫలితంగా రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇక కాల్షియం విషయానికి వస్తే రొయ్యల్లో పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల ఎముకలు, పళ్ళు దృఢంగా ఉంచడంలో ఇవి బాగాపనిచేస్తాయి. ఇన్ని పోషక విలువలు ఉన్న రొయ్యలు మన ఆరోగ్యానికి ఏవిధం గా ఉపయోగపడతాయో చూద్దాం.
రొయ్యలు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటె మెదడుకు సంబంధించిన వ్యాధులు రావు. జ్ఞాపక శక్తి పెరుగుతుందని వైద్యులు తెలిపారు.
చర్మకాంతికి సహాయ పడే విటమిన్ ఇ రొయ్య ల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించడం తో పాటు చర్మ కాంతిని పెంచుతుంది.
క్యాలరీల విషయానికి వస్తే మాంసాహారాలన్నింటితో పోల్చి చూస్తే రొయ్యల్లో తక్కువ. కాబట్టి అధిక బరువు తో బాధపడే వారు రొయ్యలను ఆహారం లో తీసుకోవడం వలన బరువు అదుపులో ఉంచుకోవచ్చు .
రొయ్యల్లో ఉండే సెలీనియమ్ క్యాన్సర్ కారకాలను సమర్ధ వంతం గా అడ్డుకుంటు రక్త సరఫరాకు ఆటంక పరచే కొవ్వును తొలగిస్తుంది.
థైరాయిడ్ సమస్య తో బాధ పడే వారికి రొయ్యలు ఒక మంచి ఔషధం గా చెప్పవచ్చు . థైరాయిడ్ హార్మోన్ల హెచ్చు తగ్గులను ఇందులో ఉన్న అయోడిన్ అదుపు చేసి , థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఒక పెద్ద రొయ్య లో 30 గ్రాముల ప్రోటీను రెండు గ్రాముల కొవ్వు , 125 మిల్లీ గ్రాముల ఖనిజాలుపొందవచ్చు. వీటిరుచి బాగుంటుంది కదా అని నూనె ఎక్కువగా వేసిన వేపుడు చేసుకుని తినకూడదు. తక్కువ నూనెతో కూర చేసుకుని తినాలి.
ఇవి త్వరగా జీర్ణమవుతాయి. రొయ్యలంత బలవర్థకమైన ఆహారం ఇంకొకటి లేదని ఓ సర్వేలో బయటపడింది. విటమిన్ బి12 రొయ్యల్లో అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రాకుండా రక్షణ కల్పిస్తుంది. దీనితో పాటు శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపయోగపడే శక్తి రొయ్యల్లో ఉంది .