విజయవాడ, డిసెంబర్ 29 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి, ఆధారాలను మాయం చేసిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. తొలుత ఈ కేసులో కిందికోర్టు ముద్దాయిగా నిర్ధారించడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న పిడతల సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా పేర్కొని విడుదల చేసిన విషయం విదితమే. ఈ కేసులో అసలు దోషులను పట్టుకోలేదంటూ ఆయేషా తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ ప్రధమంగా ముగ్గురిపై కేసు నమోదు చేసింది. అనుమానంతో మరి కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
previous post
next post