ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో 29 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
‘రఘుదీపూర్ గ్రామానికి చెందిన నిందితుడు లీతు మాలిక్ తన లైంగిక కోర్కెలు తీర్చకపోతే.. నీ నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని 25 ఏళ్ల మహిళను బెదిరించాడు. బాధితురాలు దీనిపై మార్చి ఏడున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది’ అని డేరాబిస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉమాకాంత్ నాయక్ తెలిపారు.
బాధితురాలు నిందితునికి స్వయానా మరదలు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని నాయక్ వెల్లడించారు. సమాచార సాంకేతిక చట్టం 2000 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.