YS Jagan: దేశంలో అనేక రాష్ట్రాలకు ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నాయండి కరుణ టైంలో కేంద్రం ఎక్కువగా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను .. పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేయడం తెలిసిందే. కంటికి కనిపించని ఈ మహమ్మారి అనే శత్రువుతో ప్రపంచంలో అనేక దేశాల అధినేతలు పోరాటం విషయంలో తల పట్టుకున్నారు. కానీ వైరస్ తీవ్రత మూడు విభాగాలుగా రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్ లుగా విభాగించి జగన్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేసింది.
ఇక అదేరీతిలో గ్రామ సచివాలయాలు.. వాలంటీర్ల వ్యవస్థ పనితనం విషయంలో దేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలలో ఇదే వ్యవస్థను తీసుకొచ్చి ఆలోచన చేస్తుండగా.. ఈ వ్యవస్థ పై ప్రధాన మోడీ కూడా అనేక రాష్ట్రాల సీఎంలకు.. ఇటువంటిది ప్రజలకు అందుబాటులోకి తెస్తే ప్రభుత్వ పనులు సులభతరంగా మారుతాయని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలపటం తెలిసిందే. నాడు నేడు, ఆరోగ్య విద్యా రంగంలో జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. తమ రాష్ట్రాలలో అమలు చేసే రీతిలో ఆలోచనలు చేస్తున్నారు. ఇటువంటి పరిపాలన అందిస్తూ ఉండటంతో ఏపీ.. ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు.. తమని ఏపీలో కలిపేయాలని వైయస్ జగన్ పాలన బాగుంది అని అంటున్నారు.
Read More: AP CM YS Jagan: ఆర్థిక పనుల నిర్వహణ సులభతరంకై సీఎం జగన్ కీలక నిర్ణయం..!!
ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతానికి చెందిన ప్రజలు ఒడిశా రాష్ట్ర ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు.. విజ్ఞప్తి చేస్తూ ఏపీలో కలిపేయాలని ఒడిశాలో కనీస అవసరాలు.. కూడా తీరటం లేదని తెలిపారు. గిరిజన ప్రభావిత ప్రాంతమైన ఈ సరిహద్దు ప్రాంతంలో ఒడిషా రాష్ట్రం ప్రభుత్వం కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితి లో ఉండటంతో.. ఏపీలో సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనా మరియు పథకాలు అని తెలుసుకుని ఇక తమని ఏపీలో కలిపేయాలని.. అక్కడ ఎమ్మెల్యే లకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.