మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ కి ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదల కాకుండా నిలిచిపోయింది. మొదటి సినిమా విడుదల కాకపోయినప్పటికి హీరో వైష్ణవ్ తేజ్ తో పాటు హీరోయిన్ కృతి శెట్టికి వరసగా మంచి ఆఫర్లు వస్తున్నాయి.
అంతేకాదు ఇప్పటి వరకు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోయిన్ కి ఇలాంటి అవకాశాలు రాలేదనే చెప్పాలి. కృతి శెట్టి తెలుగులో నటించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాకుండానే వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఉప్పెన సినిమా పాటలు.. పోస్టర్ లతోనే మెప్పించిన కృతి శెట్టి ఇప్పటికే పెద్ద నిర్మాణ సంస్థలలో రెండు ఆఫర్లు వచ్చాయి.
నేచురల్ స్టార్ నాని నటించబోతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నానికి జంటగా కృతి శెట్టి నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి మరో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా కృతి శెట్టి ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు కూడా. కాగా ఇంతలోనే మరో బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే రీమేక్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ కప్పెల రీమేక్.
టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, నవీన్ చంద్ర నటించబోతున్న ఈ సినిమా త్వరలో మొదలబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ చేతిలో ఉప్పెన సినిమాతో కలిపి మొత్తం నాలుగు సినిమాలలో అవకాశం అందుకుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ 4 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అదే జరిగితే ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిలై పోతుంది అంటున్నారు.