అల్లు అర్జున్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తాజా చిత్రాన్ని అధికారకంగా ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా పరిచయమవుతున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లో రాబోతున్న ఈ 21 వ సినిమాని యువసుధ ఆర్ట్స్ బ్యానర్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తుండగా 5 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక 2021 లో కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?