దేశమంతటా రైతుల ఉద్యమం హాట్ హాట్ గా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో చాలా రాష్ట్రాల రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని మొట్టమొదట స్టార్ట్ చేసింది పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులు. ఇదిలా ఉండగా తాజాగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలో ఎటువంటి బందోబస్తు లేకుండానే ప్రధాని మోడీ గురుద్వార్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా సిక్కు మత గురువు తేజ్ బహదూర్ కి నివాళులు అర్పించారు. సాధారణ భక్తుడి గా కారు దిగి గురుద్వారా లో నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఈ పర్యటనకు సంబంధించిన విషయాన్ని మోడీ యే స్వయంగా ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని మోడీ గురుద్వార్ ను సందర్శించడం తో నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఎటువంటి హడావుడి బందోబస్తు లేకపోవడంతో అక్కడ సందర్శకులు సైతం మోడీని చూసి ఆశ్చర్యపోయారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?