Old Vehicles : ఈ న్యూస్ ప్రత్యేకించి వాహనదారులకోసమే. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. అందువలన 15 ఏళ్ల క్రితం నాటి పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఇక పెను భారంగా మారనుంది. దేశవ్యాప్తంగా ఈ నిబంధన అమలులోకి రాబోతోంది. వచ్చే నెల నుంచి పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్కు దాదాపు 8 రెట్లు ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఇకనుండి 15 ఏళ్ల నాటి పాత కార్ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్కు రూ. 5 వేల వరకు ఖర్చు కానుంది. ప్రస్తుతం దీని ఫీజు కేవలం రూ. 600 ఉండటం గమనార్హం.
Old Vehicles : ఇక టూవీలర్ల విషయానికి వస్తే..
ప్రస్తుతం చార్జీ రూ. 300గా ఉండగా వచ్చేనెలనుండి రూ. 1000 చెల్లించవలసి ఉంటుంది. ఇక ఇంపోర్టెడ్ కార్ల విషయానికొస్తే, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చార్జీలు రూ. 15 వేల నుంచి ఏకంగా రూ. 40 వేలకు చేరడం కొసమెరుపు. అందువల్ల వాహనదారులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనిస్తారని మనవి. అలాగే రిరిజిస్ట్రేషన్ ఆలస్యం అయ్యే కొలదీ అంటే ప్రతి నెలా అదనపు చార్జీలు పెను భారంగా తయారయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ప్రైవేట్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఆలస్యం అయితే ప్రతి నెలా రూ. 300 అదనంగా చెల్లించుకోవాలి. అదే కమర్షియల్ వెహికల్స్కు అయితే రూ. 500 ప్రతి నెలా పెనాల్టీ పడుతుంది.
ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి:
15 ఏళ్ల నాటి ప్రతి ప్రైవేట్ వెహికల్ను ప్రతి ఐదేళ్లకు ఒకసారి రిరిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంతేకాకుండా ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమర్షియల్ వెహికల్స్ ఫిట్నెస్ టెస్ట్లు కూడా ఇకనుండి మీకు భారం కానున్నాయి. కొత్త రేట్ల ప్రకారం చూస్తే.. ఏప్రిల్ 1 నుంచి ట్యాక్సీల ఫిట్నెస్ టెస్ట్కు రూ. 7 వేలు చెల్లించుకోవాలి. ప్రస్తుతం రూ. 1000 వున్నది రూ. 7 వేలు పెరగడం గమనించవచ్చు. అలాగే బస్సులు, ట్రక్కులకు ప్రస్తుత ధర రూ. 1,500 ఉండగా, వచ్చేనెలనుండి రూ. 12,500 చెల్లించుకోవాల్సిన పరిస్థితి.