Prabhas: “బాహుబలి 2” వంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా తరువాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే. ఏకంగా ఈ సినిమాల కోసం మూడు సంవత్సరాల కంటే ఎక్కువ టైం కేటాయించడంతో పాటు మళ్ళీ మధ్యలో కరోనా రావడంతో.. కెరీర్ పరంగా భారి డ్యామేజ్ ఎదుర్కోవటం జరిగింది. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు సంబంధించి కూడా ఎటువంటి అప్ డేట్ రాకపోవటంతో… మరోపక్క అభిమానులు కూడా నిరుత్సాహం చెందుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ఆది పురుష్.. సినిమా షూటింగ్ లు జరుగుతూ ఉండగా మరో పక్క నాగ్ అశ్విన్.. సందీప్ రెడ్డి వంగా, మారుతి దర్శకులతో సినిమాలు ఒప్పుకోవడం జరిగింది. వచ్చే ఏడాది సమ్మర్ లో సలార్ విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఏ అప్డేట్ రాలేదు. మరోపక్క బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో.. చేస్తున్న “ఆది పురుష్” కి సంబంధించి కూడా ఎటువంటి అప్ డేట్ లేదు. దీంతో అభిమానుల నుండి విపరీతమైన విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే అక్టోబర్ నెలలో ప్రభాస్ పుట్టిన రోజు నాడు అనగా అక్టోబర్ 23 వ తారీకు సలార్, ఆది పురుష్ సినిమాలకు సంబంధించి ఒకేసారి డబుల్ ధమాకా అప్ డేట్ ఇవ్వటనికి సినిమా యూనిట్లు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం ఆది పురుష్ సినిమా యూనిట్ పక్కగా రెడీగా ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆది పురుష్ .. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కె అనే వర్కింగ్ టైటిల్ తో.. ప్రభాస్ షూటింగ్ స్టార్ట్ చేయడం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది దాదాపు మూడు సినిమాలు రిలీజ్ అయిన తరహాలో ప్రస్తుతం ప్రభాస్ భారీగా కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.